రాహుల్పై సోనియాదే తుది నిర్ణయం: ప్రణబ్
హైదరాబాద్: రాహుల్ గాంధీకి పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో స్థానం కల్పించే విషయంపై తుది నిర్ణయం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. పార్టీ ప్లీనరీ సమావేశాల వివరాలను అందించడానికి ఏర్పాటయిన మీడియా సమావేశంలో వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రణబ్ ఆదివారం ఆ విషయం చెప్పారు. పార్టీ కార్యకర్తల డిమాండ్కు సోనియా తలొగ్గవచ్చునని ఆయన అన్నారు. ఎఐసిసి సభ్యుల్లో అత్యధికులు కోరుకుంటే రాహుల్ గాంధీ సిడబ్ల్యుసిలోకి రావచ్చునని కూడా ఆయన అన్నారు.
సంకీర్ణ ప్రభుత్వం మిత్రపక్షాలు పదేపదే విమర్శలు చేస్తే ప్రభుత్వం ప్రజల్లో చులకనై పోతుందని ఆయన అన్నారు. అందువల్ల భాగస్వామ్య పక్షాలు అవగాహన ముందుకు పోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య విభేదాలున్న పొత్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు. బిజెపితో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ముందుకు వస్తే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ఆయన చెప్పారు.