వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా రాహుల్‌ మాట: ప్రసంగం రేపు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్లీనరీ వేదిక మీది నుంచి తాను రేపు (సోమవారం) మాట్లాడుతానని చెప్పి రాహుల్‌ గాంధీ పార్టీ ప్రతినిధులను చల్లబరిచారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు మాట్లాడడానికి సిద్ధమైనప్పుడు కాంగ్రెస్‌ ప్రతినిధులు కొంతమంది రాహుల్‌ గాంధీ మాట్లాడాలంటూ పట్టుబట్టారు. అల్లరికి దిగారు. వారు ఎంతకీ వినకపోవడంతో రాహుల్‌ గాంధీ వేదిక మీదికి వచ్చి తాను రేపు మాట్లాడుతానని చెప్పి వేదిక మీది నుంచి దిగిపోయారు.

ద్వివేదిగారు చెప్పినట్లు తాను రేపు మాట్లాడుతానని, అప్పటి వరకు తాను ప్రతినిధుల మధ్య కూర్చుంటానని ఆయన చెప్పారు. రాహుల్‌ గాంధీని వేదిక మీద చూడాలని ఉత్సాహం ప్రదర్శించిన కొంత మంది ఆయనకు ఉన్నత పదవి అప్పగించాలని కోరుకుంటున్నారు. రాహుల్‌ గాంధీ ఉన్నతమైన పార్టీ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ కార్యకర్తలు ప్లీనరీ ప్రాంగణం వెలుపల ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌ నాయకులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారు.

మరోసారి కూడా రాహుల్‌ గాంధీకి కీలక పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేయడంతో వక్తల ప్రసంగాలు ఆగిపోయాయి. కార్యకర్తలు వేదిక ప్రాంగణంలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో రాహుల్‌ గాంధీ మరోసారి వేదిక మీదికి వచ్చి తాను రేపు ప్రసంగిస్తానని, అల్లరి సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దలకు గౌవరం ఇవ్వాలని, కార్యక్రమాలు సజావుగా సాగనివ్వాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X