వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు ప్రణబ్‌ వ్యాఖ్యలు అవమానం: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్లీనరీకి అతిథ్యమిచ్చిన తెలంగాణను కాంగ్రెస్‌ అవమానించిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నాయకుడు చెన్నమనేని విద్యాసాగరరావు విమర్శించారు. తెలంగాణను అవమానించే విధంగా రక్షణ మంత్రి, యుపిఎ సబ్‌ కమిటీ చైర్మన్‌ ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రణబ్‌ది బాధ్యతారహితమైన ప్రకటన అని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ విలీనం వల్లనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం లభించిందని, అందుకు తెలంగాణ చిరస్మరణీయమైన పోరాటం చేసిందని ఆయన అన్నారు. అటువంటి తెలంగాణను ప్రణబ్‌ అవమానించడం తగదని ఆయన అన్నారు. తెలంగాణ క్విట్‌ అని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదం ఇవ్వాల్సిన సమయం తెలంగాణ ప్రజలకు వచ్చిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X