వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీహార్ గవర్నర్ బూటాకు సుప్రీం మొట్టికాయలు
హైదరాబాద్: తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతున్నాయని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. ఈ రెండు పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్, తెరాసలు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆయన అన్నారు.
తాము వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాంతాల మధ్య సమన్యాయాన్ని అనుసరించడం లేదని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై చూపుతున్న ప్రేమ వైయస్ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతలు, ఎస్యల్బిసి, వెలిగొండ ప్రాజెక్టులపై ఎందుకు చూపడం లేదని ఆయన ప్రశ్నించారు.
Comments
Story first published: Tuesday, January 24, 2006, 23:53 [IST]