వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెంగుళూర్కు దీటుగా హైదరాబాద్: వైయస్
హైదరాబాద్: బెంగుళూర్కు ధీటుగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. చార్టర్టెడ్ అకౌంటెంట్స్ ఎక్స్లెన్స్ భవన్కు ఆయన మంగళవారంనాడు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో ఇటువంటి భవనం రావడం ఎంతైనా మంచిదని ఆయన అన్నారు.
తాము తలపెట్టిన 160 కిలోమీటర్ల ఎనిమది లైన్ల అవుటర్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇటువంటి రోడ్డు నిర్మించడం దేశంలోనే తొలిసారి అని ఆయన అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ దేశంలోనే నెంబర్ వన్ అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, January 24, 2006, 23:53 [IST]