వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: పది మంది మృతి
కర్నూలు: కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు స్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా నాగులాపురం గ్రామం వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటోను బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది.
ఆటోలోని తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు చెప్పారు. బస్సు మితిమీరిన వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఆటోలో పరిమితికి మించిన ప్రయాణికులుండడం వల్ల కూడా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
Comments
Story first published: Wednesday, January 25, 2006, 23:53 [IST]