వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పత్రికలో అర్థనగ్న ఫొటోలు: కుష్బూ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: పెళ్లికి ముందు సెక్స్‌ను సమర్థించి వివాదంలో చిక్కుకున్న ప్రముఖ సినీనటి కుష్బూ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన అర్థనగ్న ఛాయాచిత్రాలు ప్రచురించిన పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని ఆమె అంటున్నారు. బ్రిటన్‌కు చెందిన మాక్సిమ్‌ అనే మ్యాగజైన్‌ కుష్బూ అర్థనగ్న ఫొటోలను ప్రచురించడమే కాకుండా వాటికి అసహ్యకరమైన వ్యాఖ్యలు కూడా రాసింది. దీనిపై ఆగ్రహించిన కుష్బూ ఆ మ్యాగజైన్‌పై పరువు నష్టం దావానే కాకుండా క్రిమినల్‌ కేసు, మహిళా ఆత్మగౌవరం కింద కేసు పెడుతానని ఆమె హెచ్చరిస్తున్నారు.

మీడియా తీరు పట్ల కుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. త్రిష, మల్లికా షెరావత్‌, బిపాసా ఎవరైనా గానీ అందరి పట్ల మీడియా అనుచితంగా ప్రవర్తిస్తోందని, ప్రజలు మోజుపడే మగవాళ్లు కూడా ఉన్నారని, వారి పట్ల మీడియా అలా వ్యవహరించడం లేదని ఆమె అన్నారు.

అయితే తాము సరదా కోసమే ఆ ఫొటోలు ప్రచురించామని, మగవాళ్ల ఆనందం కోసం ఆ పని చేశామని మ్యాగజైన్‌ వర్గాలు వివరిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌ ఎడిషన్లలో ఇటువంటివి మామూలేనని, భారతీయ ఎడిషన్‌లో ప్రచురించడం వల్ల గొడవకు దారి తీసిందని అంటున్నాయి. ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని మ్యాగజైన్‌ వర్గాలు చెబుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X