వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా జిల్లా ఓ మహిళ ఆమరణ నిరశన దీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: భర్త, అత్తామామలకు వ్యతిరేకంగా శ్రీలక్ష్మి అనే మహిళ కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కానూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఆమె అత్తామామల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీలక్ష్మిని కానూరులోని ఇంటి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో ఆమె రోడ్డు మీదికెక్కింది.

నాలుగేళ్ల క్రితం లెనిన్‌బాబు అనే వ్యక్తితో శ్రీలక్ష్మి వివాహం జరిగింది. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. అయితే ఆమె ఆడపిల్లకు జన్మనివ్వడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అత్తామామలు, భర్త వేధింపులు మొదలయ్యాయి. అయితే ఆమె కానూరులో ఖాళీగా ఉన్న ఇంటిలో ఉంటుంది. కానీ అత్తామామలు దానికీ అడ్డు వచ్చారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బలవంతంగా ఆమెను ఖాళీ చేయించారు.

హైదరాబాద్‌లోని పోలీసుల ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లనే ఇక్కడి పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని శ్రీలక్ష్మి విమర్శిస్తున్నారు. పియుసియల్‌కు చెందిన బలరామకృష్ణ ప్రసాద్‌, కేర్‌టేకర్‌ కామేశ్వరరావు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆమె అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X