వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంగ్లీష్ లెక్చరర్లకు అమెరికా బిషప్ శిక్షణ: పిన్ననమనేని
హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల ఆంగ్ల అధ్యాపకులకు ఇంగ్లీషు బోధనలో శిక్షణ ఇప్పించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు తెలిపారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్కు చెందిన ప్రముఖ ఆంగ్లాచార్యుడు జార్జ్ బిషప్ మన ఇంగ్లీషు లెక్చరర్లకు శిక్షణ ఇస్తారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
జార్జి బిషప్ 20 మంది ఇంగ్లీషు లెక్చరర్లకు ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారని, ఈ 20 మంది మిగతా లెక్చరర్లకు శిక్షణ ఇస్తారని ఆయన చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్ల పదజాల నైపుణ్యం పెరగడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Story first published: Friday, January 27, 2006, 23:53 [IST]