వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హాథీరామ్జీ మఠంపై జీవోలు చెల్లవు: హైకోర్టు
హైదరాబాద్: తిరుపతిలోని హథీరామ్జీ మఠంపై మీ ఆధిపత్యం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హాథీరామ్జీ మఠం నిర్వహణకు, ఆస్తుల అమ్మకానికి ప్రత్యేకాధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు చెల్లనేరదని హైకోర్టు శుక్రవారంనాడు స్పష్టం చేసింది. మఠానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాల్ చేస్తూ మఠాధిపతి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందిస్తూ హైకోర్టు ఆ రెండు జీవోలు కూడా చెల్లవని స్పష్టం చేసింది. మఠానికి నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులున్నాయి.
Story first published: Friday, January 27, 2006, 23:53 [IST]