వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జెడి (ఎస్)పై ధరమ్ సింగ్ మండిపాటు
బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ జెడి(ఎస్) తిరుగుబాటు ఎమ్మేల్యేలపై విరుచుకుపడ్డారు. అల్పమైన వాటికోసం వారు సిద్ధాంతాలను వదిలిపెట్టారని ఆయన విమర్శించారు. జెడి(ఎస్) సిద్దాంతాలను గాలికొదిలేసి బిజెపితో జతకట్టిందని ఆయన విమర్శించారు. వారి చెలిమి ఎంతో కాలం నిలవదని జోస్యం చెప్పారు. జెడి(ఎస్) అధినేత దేవెగౌడ మోసం చేశారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, ఎవరూ నన్ను మోసం చేయలేదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంపై దేవెగౌడ లెఫ్ట్ పార్టీ నాయకులకు వివరణ ఇవ్వాలని సింగ్ డిమాండ్ చేశారు. తాజా పరిణామం బిజెపి అవకాశ వాద రాజకీయాలకు అద్ధం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందుకు చింతించడంలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Story first published: Saturday, January 28, 2006, 23:53 [IST]