ఆసీస్ ఓపెన్: భూపతి, హింగిస్ జంట గెలుపు
మెల్బోర్న్: మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహేష్ భూపతి జంట మిక్స్డ్ డబుల్స్ జంట టైటిల్ గెలుచుకుంది. భారత డబుల్స్ స్పెషల్ మహేష్ భూపతి, మాజీ ప్రపంచ నెంబర్ వన్ మార్టినా హింగిస్ జంట కెనడాకు చెందిన డేనియల్ నెష్టర్, రష్యాకు చెందిన ఎలెనా లిఖొస్తెవా జంటను ఓడించింది.
వైల్డ్ కార్డుతో పోటీలోకి దిగిన హింగిస్, భూపతి 65 నిమిషాల పాటు ఆడి 6-3, 6-3 స్కోర్తో ప్రత్యర్థి జంటను ఓడించారు. ఆట మొదటి నుంచి చివరి వరకు ఈ జంట ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించింది. దీంతో మహేష్ భూపతి పది గ్రాండ్ స్లామ్ టైటిల్స్, హింగిస్ 15 గెల్చుకున్నట్లయింది. గాయాలతో 2002లో టెన్నిస్ నుంచి తప్పుకున్న హింగిస్ తిరిగి ప్రవేశించి ఆస్ట్రిలియా ఓపెన్ సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది.
తిరిగి ఎందుకు వచ్చావని ఎవరైనా అడిగితే తప్పుకుండా ఇవి సందర్బాలని అంటాననని హింగిస్ అన్నారు. తాను ఏ మేరకు ఆడుతాననే విషయం ఎవరికీ తెలియదని, అటువంటి సమయంతో తనతో కలిసి ఆడే ధైర్యం చేసిన మహేష్ భూపతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు.