వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బడ్జెట్ సమావేశాల తర్వాత మరో విస్తరణ: పియం
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత మరో విస్తరణ ఉంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ సూచనప్రాయంగా చెప్పారు. విదేశాంగ శాఖా మంత్రిని ఈ విస్తరణలో తీసుకుంటామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే విదేశాంగ శాఖ తనకు భారమేమీ కాదని ఆయన అన్నారు. వచ్చే నెల 16వ తేదీన ప్రారంభమై బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ నెలాఖరు వరకు సాగుతాయి.
యువ పార్లమెంటు సభ్యులకు మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం లభించలేదనే వ్యాఖ్యను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. యువ ఎంపీలు పార్టీ కోసం అధికంగా కృషి చేయాలని, ఆ తర్వాతే మంత్రి వర్గంలో వారికి ప్రాతినిధ్యం లభిస్తుందని ఆమె అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నామనే వాస్తవాన్ని కాంగ్రెస్ ఎంపీలు విస్మరించరాదని ఆమె అన్నారు. పార్టీలో కూడా తగిన మార్పులు చేస్తామని ఆమె చెప్పారు.
Comments
Story first published: Sunday, January 29, 2006, 23:53 [IST]