వన్డే జట్టు నుంచి గంగూలీ, లక్ష్మణ్ అవుట్
ముంబాయి: పాకిస్థాన్తో జరిగే వన్డే సిరీస్కు ఎంపికైన భారత జట్టులో సౌరబ్ గంగూలీకి, వివియస్ లక్ష్మణ్కు, అనిల్ కుంబ్లేకు స్థానం దక్కలేదు. గత రెండు సిరీస్లలోనూ ఆడని పేస్ బౌలర్ జహీర్ఖాన్కు 15 మంది సభ్యుల భారత వన్టే జట్టులో స్థానం దక్కింది. జె.పి. యాదవ్ స్థానంలో జహీర్కు చోటు కల్పించారు. పాకిస్థాన్తో భారత్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఐదు వన్డేలు ఆడుతుంది.
శ్రీలంక, దక్షిణాప్రికా జట్లతో ఆడిన ఆటగాళ్లనే కొనసాగించాలని తాము అనుకున్నామని, అది అత్యుత్తమ జట్టు అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నిరంజన్ షా మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్తో మూడో టెస్టు ఆడుతున్న గంగూలీ వివియస్ లక్ష్మణ్, పార్థివ్ పటేల్, అనిల్ కుంబ్లే, వాసిం జాఫర్లతో పాటు భారత్కు తిరిగి వస్తారు. గంగూలీ పేరు ప్రస్తావనకు వచ్చిందని, అయితే గెలుపును అందించే జట్టును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.
జట్టు: రాహుల్ ద్రావిడ్ (కెప్టెన్), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ (వైస్ కెప్టెన్), యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, జహీర్ఖాన్, ఆర్.పి. సింగ్, మురళీ కార్తిక్, హర్బజన్ సింగ్, ఎస్. శ్రీశాంత్.