వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏడు కొండలు ఎక్కనున్న కుమారస్వామి
బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న హెచ్డి కుమారస్వామి సోమవారం తిరుమలలో స్వామివారిని ద ర్శించుకోనున్నారు. కుమారస్వామితోపాటు ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న ఎడియూరప్ప, మరో 30 మంది ఎమ్మేల్యేలు స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. వీరందరూ ఓ ప్రత్యేక బస్సులో తిరుపతికి ప్రయాణమయ్యారు. కుమార స్వామి బృందం తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారని తెలిసింది. ఈ సందర్బంగా పోలీసులు తిరుమల కొండలలో కూంబింగ్ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
Story first published: Monday, January 30, 2006, 23:53 [IST]