వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ పర్యటనపై సౌదీ రాజు సంతృప్తి
దుబాయ్: భారత దేశం, చైనాలలో తన పర్యటన విజయవంతమైందని సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ రెండు దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పడం తమ అభిమతమని ఆయన అన్నారు. భారత్, చైనా దేశాధినేతలు సౌదీతో సంబంధాలను బలపరుచుకోవాలనే కోరికను వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఈ రెండు దే శాలతోను తాము చేసుకున్న ఒప్పందాలు సరైన దిశలోనే ఉన్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్తో సౌదీకి గల చెలిమి గురించి భారత దేశానికి వివరించానని, ఆ దేశం తమ పరిస్ధితిని అర్ధం చేసుకున్నదని ఆయన అన్నారు. భారత్తో తమ సంబంధాలు పాక్స్తాన్తో ఆ దేశానికి గల సంబంధాలను మెరుగుపరచగలవనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Comments
Story first published: Monday, January 30, 2006, 23:53 [IST]