వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రివర్గంలోబడుగువర్గాలకు అన్యాయం: బాబు
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ బలహీనవర్గాలకు అన్యాయం చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర నాయకులకు దక్కిన మంత్రిత్వ శాఖలపై కూడా అంత ప్రాధాన్యం కలవేమీ కావని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్వహించిన ప్లీనరీలో ఎటువంటి ప్రయోజనాత్మక నిర్ణయాలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు, రైతులకు కనీస మద్దతు ధర వంటి ప్రధాన విషయాలు ప్లీనరీలో చర్చకు రాకపోవడం విచారకరమని ఆయన అన్నారు. గవర్నర్ల నివాసాలైన రాజ్భవన్లను కాంగ్రెస్ పిసిసి కార్యాలయాలుగా మార్చుతోందని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Monday, January 30, 2006, 23:53 [IST]