వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకన్న స్వామి సన్నిధిలో కంచి స్వామి
తిరుపతి: కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఆలయ మహా కుంభాభిషేకంలో పాల్గొనడానికి సోమవారం వచ్చిన ఆయన మంగళవారం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. జయేంద్ర సరస్వతికి మహాద్వారం వద్ద టిటిడి అధికారులు స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామిని కంచి స్వామి ఆశీర్వదించారు. దైవ దర్శనం తర్వాత కంచి స్వామి తిరుమలలోని కంచి మఠంలో బస చేశారు.
Comments
Story first published: Tuesday, January 31, 2006, 23:53 [IST]