వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బస్సులు ఢీకొని ఇద్దరు మృతి
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో పదిమంది గాయపడ్డారు. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. కర్నూలు డిపోకు చెందిన డ్రైవర్ శివన్న మృతుల్లో ఒకరు. ఆదోని నుంచి కర్నూలు వస్తున్న బస్సు, కర్నూలు నుంచి ఆదోని వెళ్తున్న బస్సు పొగమంచు కారణంగా పరస్పరం ఢీకొన్నాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Tuesday, January 31, 2006, 23:53 [IST]