వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉద్యమం
హైదరాబాద్: తెలుగుభాషపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా ఫిబ్రవరి 21నుంచి నిరాహారదీక్షలు చేయనున్నట్టు తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రకటించింది. విశాఖలోని 70 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టడాన్ని సమాఖ్య తీవ్రంగా నిరసిస్తోంది. ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో బోధన జరగాలని, ఇంటర్మీడియట్ స్ధాయిలో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరి చేయాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు చుక్కా రామయ్య, ఉపాధ్యక్షుడు జిఎస్ వరదాచారి డిమాండ్ చేశారు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని వారు విమర్శించారు.
Story first published: Tuesday, January 31, 2006, 23:53 [IST]