వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్కు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జయప్రకాష్రెడ్డి మొర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగుబాటు ఎమ్మేల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మంగ ళవారం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిశారు. తన నియోజక వర్గం సంగారెడ్డి నుంచి కార్యకర్తలతో పాదయాత్ర చేసి హైదరాబాద్ చేరుకున్న జయప్రకాష్ రెడ్డి జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు చెందిన మంజీరా నది జంటనగరాలకు నీటిని అందిస్తుంటే, ఆ జిల్లావాసులు నీటికి ఇబ్బంది పడటం బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. గోదావరి జలాలను మెదక్ జిల్లాకు మళ్లించే ప్రణాళికను రూపొందించి నీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
Comments
Story first published: Tuesday, January 31, 2006, 23:53 [IST]