వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వంటగ్యాస్, కిరోసిన్ ధరలు పెరగవు: దేవరా
న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ల ధరలు పెరగబోవని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా స్పష్టం చేశారు. తగిన ధరలకు ప్రజలు వినియోగించే వంటగ్యాస్ను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. కిరోసిన్, వంటగ్యాస్ ధరలు పెరుగుతాయనే వార్తలను ఆయన ఖండించారు.
పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు విషయమై ఆయన గురువారంనాడు సిపియం నాయకుడు సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. సమాజంలోని బలహీనవర్గాల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రథమ ప్రాధ్యానం ఇస్తోందని ఆయన చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే కిరోసిన్ ధరను, ఎల్పిజి గ్యాస్ ధరను పెంచే ఉద్దేశం లేదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, February 4, 2006, 23:53 [IST]