కర్ణాటక సియంగా కుమారస్వామి ప్రమాణం
బెంగుళూరు: జనతాదళ్ (సెక్యులర్) తిరుగుబాటు నాయకుడు కుమారస్వామి తన కల నెలవేర్చుకున్నారు. ఆయన శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు బి.యస్. ఎదియూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ టి.యన్. చతుర్వేది ప్రమాణం స్వీకారం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిజెపి అగ్రనేతలు తరలి వచ్చారు. బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడితో పాటు పలువురు పార్టీ నాయకులు విచ్చేశారు.
తన తండ్రి దేవెగౌడ్ నాయకత్వంలోని జెడి -యస్ను చీల్చి కుమారస్వామి బిజెపితో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. ధరంసింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ - జెడి (యస్) సంకీర్ణ ప్రభుత్వానికి కుమార స్వామి నాయకత్వంలోని జెడి (యస్) శాసనసభ్యులు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో ధరంసింగ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బిజెపితో కలిసి కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు.