వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెపాసిటర్లుంటేనే అక్రమ కనెక్షన్ల క్రమబద్దీకరణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఈ ఏడాది మార్చి లోగా కెపాసిటర్లు బిగించుకునే రైతుల వ్యవసాయం అక్రమ కనెక్షన్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్‌ సరఫరా, పంపిణీలపై ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సమీక్షానంతరం విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్‌ అలీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ రీతిలో లక్ష అక్రమ కనెక్షన్లను క్రమబద్దీకరించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఐయస్‌ఐ మార్కు పంపుసెట్లు బిగించుకోవడానికి 2008 మార్చి వరకు గడువు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయానికి రోజుకు 7 గంటలు విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఈ విద్యుత్‌ను రెండు దశల్లో సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. రబీలో విద్యుత్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X