వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఆర్ సంతోషించి వుండేవారు: పురంధరేశ్వరి
తిరుపతి: తనకు మంత్రి పదవి వచ్చినందుకు బతికి ఉంటే తన తండ్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు ఎంతో సంతోషించి ఉండేవారని కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి దగ్గుబాటు పురంధరేశ్వరి అన్నారు. తన భర్త, కాంగ్రెస్ శాసనసభ్యుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఆమె తిరుమల సందర్శించారు. ఎన్.టి. రామారావును ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎలా అవమానించారో అభిమానులు గుర్తు చేసుకోవాలని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఎన్.టి. రామారావును చంద్రబాబు అవమానించిన విషయం అందరికీ తెలిసిందేనని ఆమె అన్నారు. ప్రాణాల కన్నా ఆత్మగౌరవమే ముఖ్యమని ఎన్.టి. రామారావు భావించారని, ఆత్మగౌరవం కోసం ఎన్టీ ఆర్ నిరంతరం తపించేవారని ఆమె అన్నారు. దేశంలో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
Comments
Story first published: Friday, February 3, 2006, 23:53 [IST]