వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాంపల్లి రైల్వే స్టేషన్కు బాంబు బూచి
హైదరాబాద్: హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ను శనివారంనాడు బాంబు బూచి కుదిపేసింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు ఒక ఆగంతకుడు ఫోన్ చేసి చెప్పి రిసీవర్ పెట్టేశాడు. దీంతో పోలిసు అధికారులు అప్రమత్తమై రైల్వే స్టేషన్లో గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు అందిన సమాచారం ఉత్తుత్తదే అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
రాష్ట్రంలో ఐయస్ఐ తీవ్రవాదుల కార్యకలాపాలు ముమ్మరమైన విషయం వెల్లడైన నేపథ్యంలో రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు అందిన సమాచారం కలవరపెట్టింది. ఇటీవలి కొన్ని సంఘటనలు కూడా పోలీసు అధికారులను మరింత అప్రమత్తం చేశాయి.
Comments
Story first published: Saturday, February 4, 2006, 23:53 [IST]