వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూస్తామంటే చేస్తామని కాదు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌పై తాను హామీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిశీలిస్తానని తాను చెప్పానని, ఆ హామీని సర్పంచ్‌లు వక్రీకరించారని ఆయన శనివారం అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలయింది. స్థానిక సంస్థలకు విధులను, నిధులను బదలాయించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గురువారంనాడు చలో హైదరాబాద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్‌పవర్‌పై తమకు హామీ ఇచ్చారని సర్పంచ్‌ల సంఘం నాయకులు చెప్పారు.

సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ విషయంలో మీడియా వార్తలు సరైనవి కావని ఆయన అన్నారు. చూస్తామంటే చేస్తామని కాదని ఆయన వివరణ ఇచ్చారు. పర్పంచ్‌ల చెక్‌ పవర్‌ విషయంలో సంబంధిత అధికారులను చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో సర్పంచ్‌ల సంఘం కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. ప్రభుత్వం మాట మార్చడం దురదృష్టకరమని సంఘం నాయకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X