వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాగు నీటి ప్రాజెక్టులకు ఏడాదిలో 10 వేల కోట్లు: రోశయ్య
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2006-07 ఆర్థిక సంవత్సరంలో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి శనివారంనాడు ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. సమావేశం అనంతరం రోశయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సాగునీటి ప్రాజెక్టులకు 2007-08 ఆర్థిక సంవత్సరంలో 13 వేల కోట్ల రూపాయలు, 2008-09 ఆర్థిక సంవత్సరంలో 17 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై, నిధుల ఖర్చుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Story first published: Saturday, February 4, 2006, 23:53 [IST]