వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హామీ తప్పైతే మా తడాఖా చూపుతాం: జెఎసి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌పై హామీ ఇవ్వలేదని తన కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనపై ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. తన కార్యాలయంపై వెలువడిన ప్రకటనపై స్పష్టమైన ప్రకటన చేయాలని జె ఎసి నాయకులు రాజేంద్రప్రసాద్‌, తదితరులు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే జె ఎసి అత్యవసర సమావేశం జరిగింది.

ముఖ్యమంత్రికి తెలిసే ఆయన కార్యాలయం నుంచి ఆ ప్రకటన వెలువడిందా, లేదా అనేది తేలాలని వారన్నారు. సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి ఆ విషయం చెప్తే తమ తడాఖా ఏమిటో చూపిస్తామని వారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం తమను అవమానించిందని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X