వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్లమలలో రెండు చోట్ల భారీ ఎదురుకాల్పులు
ఒంగోలు: నల్లమల అడవుల్లో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య రెండు చోట్ల ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులు ఆదివారం సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మాలకొండ మెట్ట, దారుబైలు పెంటల వద్ద ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఎదురుకాల్పులు ప్రారంభమాయ్యయి.
ఎదురు కాల్పులు జరుగుతున్న ప్రాంతాలు దట్టమైన అడవిలో ఉన్నాయి. దాంతో బయటకు సమాచారం అందడం కష్టంగా ఉంది. దారుబైలుపెంట వద్ద నక్సల్స్ పోలీసులపైకి ఆరు రాకెట్ లాంచర్లను ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడి నుంచి పోలీసులు తప్పించుకున్నారు. మావోయిస్టు ప్రముఖ నాయకులు ఉండడం వల్లనే రాకెట్ లాంచర్ల ప్రయోగం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Story first published: Sunday, February 5, 2006, 23:53 [IST]