వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గర్జనలు,పోరులు అభివృద్ధికి వ్యతిరేకం: పొన్నాల
వరంగల్: గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై గర్జనలు, పోరాటాలు అభివృద్దిని కాంక్షించేవి కావని భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆందోళనకు పిలుపునిచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై సిపియం ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో మంత్రి ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా ప్రతిస్పందించారు.
20 ఏళ్ల క్రితం కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కాగా, పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన అంతర్రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Comments
Story first published: Sunday, February 5, 2006, 23:53 [IST]