వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దాసరి శాఖల్లో కోత: ఇప్పుడు బొగ్గు ఒక్కటే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు మంత్రిత్వ శాఖల్లో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోత పెట్టారు. ఆయన వద్ద గనులు, బొగ్గు శాఖలు రెండూ ఉండగా, గనుల శాఖను తీసేసి బొగ్గు శాఖను ఒక్కటే ఉంచారు. దీనికి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆమోద ముద్ర వేశారు. బొగ్గు గనుల శాఖగా ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన శిబూ సోరేన్ ఉన్నారు. దాసరి ఈ శాఖకు సహాయ మంత్రి.
దాసరి నారాయణ రావుకు, పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామ జోగయ్యకు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. హరిరామ జోగయ్య దాసరి నారాయణరావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వీరిరువురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించకుండా కేంద్రం అన్యాయం చేసిందని దాసరి నారాయణ రావు ఇటీవల విమర్శలు చేశారు.
Story first published: Tuesday, February 7, 2006, 23:53 [IST]