వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ అప్పీల్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధం: ఇంజమామ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

పెషావర్‌: తన అవుట్‌కు భారత జట్టు సభ్యులు అప్పీల్‌ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ అన్నారు. పెషావర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత ఫీల్డర్‌ వికెట్ల వైపు విసిరిన బంతిని ఇంజమామ్‌ బ్యాట్‌తో అడ్డుకున్నాడు. దీంతో భారత క్రీడాకారుల అప్పీలు మేరకు అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు.

భారత్‌ తన ముందు ఉంచిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్‌ తొలి వన్డేను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన గెలుచుకుంది. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట నిలిచిపోయి ఆ స్థితికి దారి తీసింది. ఈ విధమైన రీతిలో అవుట్‌ అయినవారిలో ఇంజమామ్‌ మూడో ఆటగాడు. రాహుల్‌ ద్రావిడ్‌ నాయకత్వంలోని జట్టు ఈ పద్ధతిని అనుసరిస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని ఇంజమామ్‌ అన్నాడు.

భారత ఫీల్డర్ల అప్పీల్‌ క్రికెట్‌ స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్థాన్‌ కెప్టెన్‌ తన అభిప్రాయమని, ఒక బ్యాట్స్‌మన్‌ అవుట్‌ ఇవ్వడానికి ఎన్ని పద్ధతులైనా వుండవచ్చునని, అయితే వాటిలో చాలా క్రీడాస్ఫూర్తికి తగినవి కావని ఆయన అన్నాడు. పెషావర్‌ వన్డే కీలకమైన దశలో ఉన్నప్పుడు ఆ అప్పీల్‌ చేశారని, రాహుల్‌ ద్రావిడ్‌, అతని జట్టు ఆ విధంగా చేస్తారని తాను ఊహించలేదని ఇంజమామ్‌ అన్నాడు.

అంపైర్ల నిర్ణయం సరైందేనని, అయితే అటువంటి నిబంధన సరైంది కాదని, తాను అడ్డుకోకపోతే బంతి తనకు తాకి ఉండేదని అతను అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X