వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసీటు వల్ల మాకు ఏం ఒరగదు: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: రాజ్యసభ సీటు వల్ల తమకు ఒరిగేదేమీ లేదని భారత కమ్యూనిస్టు పార్టీ లోక్‌సభ సభ్యుడు సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. వామపక్షాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్రం నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సీటును సిపిఐకి కేటాయిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చేసిన ప్రకటనపై ఆయన బుధవారం ఆ విధంగా ప్రతిస్పందించారు.

ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మనస్పర్థలు పెరిగితే సంబంధాలు తెగిపోతాయని ఆయన అన్నారు. వామపక్షాల అంగీకారాలను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X