వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రాంతీయ పాదయాత్రలు సబబే: బాబు
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై తమ పార్టీ నాయకులు ప్రాంతాల వారీగా చేపట్టిన పాదయాత్రలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమర్థించారు. పాదయాత్రల్లో తాను పాల్గొనడం లేదని, అయితే పాదయాత్రలను తాను బలపరుస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ను ఆయన గురువారం కలుసుకున్నారు. గవర్నర్తో ఆయన దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. గవర్నర్ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆయన చెప్పారు.
గవర్నర్తో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రాజెక్టుల స్థితిగతులను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి తమ నాయకులు ప్రాంతాలవారీగా పాదయాత్రలు చేస్తున్నారని ఆయన చెప్పారు. తమ పార్టీ నాయకులు పాదయాత్రలు చేపట్టడం సమంజసమేనని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, February 9, 2006, 23:53 [IST]