వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జాతీయ రహదారుల గుర్తింపునకు వైయస్ లేఖ
హైదరాబాద్: రాష్ట్రంలోని 17 రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఓ లేఖ రాయనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి జక్కంపూడి రామమోహన్ రావు గురవారంనాడు మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని చెప్పారు. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి తాను కేంద్రానికి లేఖ రాసే విషయాన్ని చెప్పారు.
వచ్చే బడ్జెట్లో రోడ్లకు నిధులు పెంచడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పారు. ఉక్కు, సిమెంట్ ధరలు పెరిగినందున కాంట్రాక్టర్లకు చెల్లించే మొత్తాన్ని పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నందున రోడ్ల నిర్మాణానికి నిధులు పెంచడం కుదరదని ముఖ్యమంత్రి చెప్పారు. రోడ్లు భవనాల శాఖలో ఖాళీగా ఉన్న 400 ఎఇ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Story first published: Thursday, February 9, 2006, 23:53 [IST]