వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిశ్రమల సదుపాయాలకు ఓ సంస్థ: వైయస్
హైదరాబాద్: రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పెంచి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు ఒక సంస్థ ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఉన్నతాధికారులు, మంత్రుల సమావేశంలో ఆయన గురువారంనాడు ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అనువుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచాలని ఆయన అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులను ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాజమండ్రి, కడప విమానాశ్రయాలను పునరుద్ధరించనున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఎపి భవన్ను ఆధునీకరించనున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, February 9, 2006, 23:53 [IST]