దేశంలో ఎక్కడికి ఫోన్ చేసినా నిమిషానికి రూ.1
న్యూఢిల్లీ: వినియోగదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒన్ ఇండియా పథకాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బియస్యన్యల్), మహానగర్ టెలికమ్ నిగమ్ లిమిటెడ్ (యంటియన్యల్) శుక్రవారం ప్రకటించాయి. ల్యాండ్ లైన్ నుంచి దేశంలో ఎక్కడికి ఫోన్ చేసినా ఒక రూపాయి మాత్రమే చార్జీ చేస్తారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది.
దీంతో పాటు బియస్యన్యల్ తన మొబైల్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మొబైల్ టు మొబైల్ కనీస చార్జీ నిమిషానికి 40 పైసలు మాత్రమే చార్జీ విధిస్తుంది. బియస్యన్యల్ ప్రకటించిన ఈ కొత్త ప్యాకేజీ ప్రకారం ఫిక్స్డ లైన్ సర్వీసెస్కు రెంటల్ 299 రూపాయలు, లోకల్ కాల్ చార్జీ మూడు నిమిషాలకు ఒక రూపాయి వసూలు చేస్తారు. ల్యాండ్లైన్ నుంచి దేశంలోని ఎక్కడికైనా లేదా మొబైల్కు కాల్ చేస్తే నిమిషానికి ఒక రూపాయి వసూలు చేయనున్నట్లు బియస్యన్యల్ చైర్మన్ ఎ.కె. సిన్హా చెప్పారు.