వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాబ్‌సిటీ చంద్రబాబు చలువే: ఎర్రంనాయుడు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి ఫలితంగానే హైదరాబాద్‌కు ఫ్యాబ్‌సిటీ వచ్చిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు అన్నారు. చంద్రబాబు ముందు చూపు వల్లనే ఫ్యాబ్‌ సిటీ హైదరాబాద్‌కు వచ్చిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

చంద్రబాబు నిర్ణయాల వల్ల, అమలు చేసిన కార్యక్రమాల వల్ల, కృష్ణా జలాలను తరలించడం వల్ల హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని, దాని వల్లనే ఇప్పుడు హైదరాబాద్‌కు ఫ్యాబ్‌సిటీ వచ్చిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్‌ సంస్కరణల ఫలితంగానే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించగలుగుతోందని, ఈ విషయాన్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పారని ఆయన అన్నారు. చంద్రబాబు పథకాలనే పేర్లు మార్చి ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X