వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబు కృషి ఉంటే ఉండవచ్చు: రోశయ్య
హైదరాబాద్: ఫ్యాబ్సిటీ హైదరాబాద్కు రావడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కృషి ఉంటే ఉండవచ్చునని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. చంద్రబాబు ప్రచారం వల్ల ఫ్యాబ్సిటీ వచ్చి వుంటే అందుకు అభినందనలు తెలియజేస్తున్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యంగ్యంగా అన్నారు.
కొందరు కొన్ని ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలం కృషి చేస్తుంటారని, ఆ ప్రాజెక్టులు వచ్చే నాటికి అధికారంలో లేకుండా పోతారని, తెలుగుదేశం పార్టీ పరిస్థితి అదేనని ఆయన అన్నారు. ఏ ప్రాజెక్టు వచ్చినా అప్పుడు అనుకున్నాను, కానీ ఈలోగా ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు అంటుంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులను రాబట్టడంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి విఫలమయ్యారనే విమర్శలను ఆయన ఖండించారు.
Comments
Story first published: Friday, February 10, 2006, 23:53 [IST]