వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనతి కాలంలోనే తెలంగాణ: సంతోష్‌ రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, మాజీ మంత్రి ఎస్‌. సంతోష్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ నాయకులు కె. చంద్రశేఖర్‌ రావు, ఎ. నరేంద్ర కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తే పార్టీ కార్యకర్తల్లో, తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ అభివృద్ధి గురించి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారని, అది తమ ఉద్యమ ఫలితమేనని, ఇది చాలా మంచిదని ఆయన అన్నారు. ఉనికి కోసమే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గోదావరి జల సాధన పాదయాత్రను చేపట్టిందని ఆయన అన్నారు. ఎవరైనా ఉనికి కోసం ప్రయత్నం చేయడం సాధారణమేనని, అందువల్ల తెలుగుదేశం కార్యక్రమాన్ని విమర్శించడం తనకు ఇష్టం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X