వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబాయిలో ఎటర్నల్ గాంధీ ఎగ్జిబిషన్
ముంబాయి: ముంబాయిలోని నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో జాతిపిత మహాత్మ గాంథీపై మల్టీ మీడియా, ఆర్ట్ కలగలసిన ఎగ్జిబిషన్ను శనివారం ప్రారంభించారు. నాలుగు వారాలపాటు ప్రదర్శించే ఈ ఎగ్జిబిషన్ను ఆదిత్య బిర్లా గ్రూప్ నిర్వహిస్తుంది. న్యూఢిల్లీ లోని గాంధీ స్మృతిలో జరిగిన ఎగ్జిబిషన్ విజయవంతమైన తర్వాత ఎటర్నల్ గాంధీ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించడమే ఆయనకు నిజమైన నివాళి అనిపించిందని ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు రాజశ్రీ బిర్లా విలేకరులకు తెలిపారు. త్వరలో లండ న్, దుబాయ్, దక్షిణాఫ్రికాలలో ఇదే తరహా ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నామని ఆమె తెలిపారు.
Comments
Story first published: Saturday, February 11, 2006, 23:53 [IST]