వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిపిఎంకు ఎస్పీ, టిడిపి మద్దతు
న్యూఢిల్లీ: కేంద్రంలో యుపిఎ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న సిపిఎంకు సమాజ్వాది, తెలుగుదేశం పార్టీలు మద్దతు పలికాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రు ములాయం సింగ్ యాదవ్ను కలుసుకును మూడో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది. యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం గురించి ములాయంతో చర్చించలేదని అనంతరం చంద్రబాబు విలేకరులకు చెప్పారు. దేశంలో లౌకిక శక్తుల పునరేకీకరణ జరగవలసి అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ములాయం, చంద్రబాబు నాయుడు సమావేశం మూడో ఫ్రంట్ ఏర్పాటుకు నాంది కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Story first published: Saturday, February 11, 2006, 23:53 [IST]