వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలవరంతోముంచితే వైయస్ సమాధి:నరేంద్ర
భద్రాచలం:పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారాఅడవితల్లిని సమాధి చేస్తే ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిసమాధి అవుతారని తెలంగాణ రాష్ట్రసమితి (తెరాస) నేత, కేంద్ర మంత్రి ఎ.నరేంద్ర వ్యాఖ్యానించారు. తెరాసచేపట్టిన పోలవరం గర్జన సభలోఆయన ఆదివారంనాడు ప్రసంగించారు.పోలవరం ప్రాజెక్టు వద్దని అందరూఘోషిస్తున్నా ప్రభుత్వం వినడం లేదని,ఇది ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిఅహంకారమని ఆయన అన్నారు.
కృష్ణా, గోదావరిజలాల్లో 80 శాతం కోస్తాంధ్రకేదక్కుతున్నాయని, తెలంగాణకు 15శాతం కూడా దక్కడం లేదని,నీరున్నవారికే నీరు ఇవ్వడం అన్యాయమనిఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకువ్యతిరేకంగా జరుగుతున్నయుద్ధంలో వీరులై ముందుండాలనిఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అడ తల్లిబిడ్డలకు తమ అండ ఎప్పుడూ ఉంటుందనిఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, February 12, 2006, 23:53 [IST]