నిర్వాసితులుసహజం, పునరావాసం కల్పిస్తాం: సియం
విజయనగరం/వరంగల్:ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు కొందరునిర్వాసితులు కావడం సహజమని,నిర్వాసితులకు వంద శాతంపునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅన్నారు. విజయనగరం, వరంగల్జిల్లాల్లో ఆయన ఆదివారంనాడు ఇందిరమ్మగ్రామసభల్లో మాట్లాడారు. పోలవరంనిర్వాసితులకు 45 రూపాయల ఖర్చుతో పక్కాఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు.పోలవరం ప్రాజెక్టును బచావత్ అవార్డునిబంధల మేరకే నిర్మిస్తున్నామని ఆయనచెప్పారు.
వచ్చే మూడేళ్లలోనిరుపేదలకు 50 లక్షల ఇళ్లు నిర్మించిఇస్తామని ఆయన చెప్పారు. ఇందిరమ్మపథకం కింద వచ్చిన గ్రామాలన్నింటిలోమూడేళ్లలో మౌలిక సదుపాయాలన్నీకల్పిస్తామని ఆయన చెప్పారు. మేడారంగ్రామాన్ని ఇందిరమ్మ పథకం కిందఅభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.అందరికీ ఉపాధి కల్పించడమే తమప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.గర్బిణీ స్త్రీలు ఆస్పత్రులకువెళ్లిరావడానికి ఉచిత బస్సు పాసులుఇస్తున్నామని ఆయన చెప్పారు. డ్వాక్రాగ్రూప్లకు చేస్తున్న సహాయాన్ని ఆయనవివరించారు.