వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంస్కరణల వల్ల ధనిక, పేద తేడా పెంపు: బాబు
హైదరాబాద్: దేశంలో అమలవుతున్న సంస్కరణల వల్ల పేదులు, ధనవంతుల మధ్య అంతరం పెరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సంస్కరణల ఫలితాలు పేదలకు అందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సోమవారం జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు.
సంస్కరణలు 1991లో మొదలయ్యాయని, ఆ కాలంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఉందని, ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వమే ఉందని ఆయన చెప్పారు. సంస్కరణల వల్ల దేశం అభివృద్ధి బాగుందని, సార్క్ దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. సంస్కరణల వల్ల అట్టడుగు వర్గాల్లో కొంత అసంతృప్తి నెలకొని ఉందని ఆయన చెప్పారు. సంస్కరణల వల్ల సంభవిస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందని ఆయన చెప్పారు. సంస్కరణల వల్ల సంపద పెరుగుతోందని, ఆర్థికాభివృద్ధి బాగుందని, ఇప్పుడు కూడా బాగానే ఉందని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, February 13, 2006, 23:53 [IST]