వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థులపై కాలేజీ మార్కు గూండాగిరి
హైదరాబాద్: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో గల నిజాం ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై గుండాలతో దాడి చేయించింది. విద్యార్థులపై ర్యాగింగ్ కేసు పెడతానంటూ కాలేజీ ప్రిన్సిపాల్ బెదిరించారు. ఎంతకీ విద్యార్థులు దిగి రాకపోవడంతో యాజమాన్యం గూండాలను ప్రయోగించింది. కనీస సౌకర్యాలు అడిగినందుకే విద్యార్థులపై యాజామాన్యం దౌర్జన్యానికి దిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
విద్యార్థులను, వార్త సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులను గుండాలు తరిమికొట్టారు. పలువురు విద్యార్థులను, మీడియా ప్రతినిధిని నిర్బంధించి తుపాకి గురి పెట్టి కాల్చేస్తామంటూ గూండాలు బెదిరించారు. గూండాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ కరస్పాండెంట్ సోదరుడు హకీద్ పరారీలో ఉన్నాడు. యాజమాన్య వైఖరికి నిరసనగా కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి.
Comments
Story first published: Monday, February 13, 2006, 23:53 [IST]