వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాతప్రతులను రక్షించుకోకుంటే ముప్పు: సినారె
హైదరాబాద్: ఎంతో ఘన చరిత్ర కలిగిన తెలుగు సంస్కృతిని, రాతప్రతులను పరిరక్షించుకోకపోతే జాతి అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భాషా సంస్కృతులు, రాతప్రతుల పరిరక్షణ కోసం తలపెట్టిన ర్యాలీని ఆయన సోమవారంనాడు జెండా ఊపి ప్రారంభించారు.
భాషాసంస్కృతులు, రాతప్రతుల పరిరక్షణ కోసం తెలుగువారంతా కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ అసెంబ్లీ మీదుగా పబ్లిక్ గార్డెన్స్లోని జవహర్ బాలభవన్కు చేరుకుంది. ర్యాలీలో హైదరాబాద్కు చెందినవారే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన రచయితలు, కవులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Story first published: Monday, February 13, 2006, 23:53 [IST]