వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసమ్మతికి వైస్ ప్రోత్సాహం: తెరాస
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తమ పార్టీలో అసమ్మతిని ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)అధికార ప్రతినిధి ప్రకాశ్ విమర్శించారు. తెలంగాణ జాగరణ సేన (టిజెయస్)ను బలోపేతం చేసి క్రియాశీలం చేసేందుకు తమ నేత కె. చంద్రశేఖర్ రావు రేపు టిజెయస్ కమాండర్లతో సమావేశమవుతారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
తమ పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించడంలో భాగంగానే ముఖ్యమంత్రి తమ అసమ్మతి శాసనసభ్యుడు దుగ్యాల శ్రీనివాస రావు నియోజకవర్గంలో అభివృద్ధి సభ పెట్టారని ఆయన అన్నారు. అభివృద్ధి అనే కుట్ర ద్వారా ముఖ్యమంత్రి తమ పార్టీలో అసమ్మతిని పెంచి పోషిస్తున్నారని ఆయన అన్నారు. అసమ్మతి శాసనసభ్యులపై తాము ఏ విధమైన చర్యలు తీసుకోబోమని, సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, February 13, 2006, 23:53 [IST]