వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక రాష్ట్రంలో మెరైన్‌ పోలీసు స్టేషన్లు: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సముద్ర తీరంలో మెరైన్‌ పోలీసు స్టేసన్ల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేను చెప్పారు. 36 కోట్ల రూపాయల వ్యయంతో మెరైన్‌ పోలీసు స్టేసన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన బుధవారంనాడు చెప్పారు. ప్రయోగాత్మకంగా మొదట ఆరు మెరైన్‌ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మెరైన్‌ పోలీసు స్టేషన్ల సిబ్బందికి కోస్ట్‌ గార్డ్‌ అనే పారామిలటరీతో శిక్షణ ఇప్పించనున్నట్లు ఆయన తెలిపారు. మెరైన్‌ పోలీసు స్టేషన్ల ఏర్పాటుపై వివిధ శాఖలతో చర్చిస్తున్నట్ల ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మావోయిస్టులకు నేపాల్‌ మావోయిస్టులతో సంబంధాలు లేవని స్పష్టమైందని ఆయన చెప్పారు. నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల సంయుక్త టాస్క్‌ఫోర్స్‌ ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునే పని సంతృప్తికరంగా సాగుతోందని ఆయన చెప్పారు. బుష్‌ పర్యటన కోసం అమెరికా పోలీసులతో సమన్వయం సాధిస్తున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X